16-08-2025 07:43:11 PM
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి
సఖి కేంద్రం సందర్శన
నల్గొండ టౌన్,(విజయక్రాంతి): బాధితులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి పేర్కొన్నారు. శనివారం ఆమె జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రాన్ని సందర్శించి అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విజేతలుగా ఉన్నటువంటి మహిళలని జిల్లాలో గుర్తించి వారికి గ్రామ్య రిసోర్స సెంటర్ ఫర్ ఉమెన్ సెంటర్ ఫర్ ఓల్డ్ సాలిదారిటీ వారి ఆర్థిక సౌజన్యంతో జిల్లాల్లో గుర్తించబడిన సఖి విజేతలకు 17 మందికి కుట్టు మిషన్లను పంపిణీ పంపిణీ చేశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ సేవలలోసేవలలో జాప్యం జరిగినట్లయితే ప్రభుత్వం చిత్తశుద్ధితో పోలీస్, న్యాయ శాఖల సమన్వయంతో త్వరితగతిన న్యాయం జరగడం కోసం కృషి చేస్తామని ఆమె అన్నారు. సఖి విజేతలకు వారి యొక్క సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండి వారికి ఏ విధమైనటువంటి సహాయం చేసినట్లయితే భవిష్యత్తులో మీరు ముందుకెళ్లగలుగుతారని వీరిని ముందుకు తీసుకెళ్లడం కోసం వివిధ ప్రభుత్వల యొక్క శాఖల సమన్వయం ఏ మేరకు అవసరము ఉన్నదో గుర్తించి వీరి కోసం జిల్లా స్థాయిలో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సఖి విజేతలకు న్యాయం జరిగేలా చూడడం జరుగుతుందని అన్నారు.
సఖి కేంద్రం నందు నెలకు సుమారుగా 60 నుంచి 70 కేసులు రావడం జరుగుతుందని వారికి జిల్లాలో ఐదు రకాలైనటువంటి సేవలును ఒకేచోట అందించడంతోపాటు వారికి త్వరితగతిన న్యాయం జరిగేలా సిబ్బంది కృషి చేయడం జరుగుతుందని అన్నారు. సఖి విజేతలు మానసిక స్థైర్యాన్ని పెంపొంది బలంగా దృఢంగా ఉండి వారు వారి కుటుంబ సభ్యుల సహకారంతో విజేతలుగా తయారవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కె.వి కృష్ణవేణి, గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్ డైరెక్టర్ సుమలత, సఖి సిబ్బంది సునీత, వరుణ, నాగమణి తదితరులు పాల్గొన్నారు.