16-08-2025 08:53:11 PM
కాగజ్ నగర్ (విజయక్రాంతి): కాగజ్ నగర్ రూరల్ మండలం మెట్పల్లి వాగు వద్ద వరద ఉధృతిని జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్(District SP Kantilal Patil) శనివారం పరిశీలించారు. వరద ఉధృతి అధికంగా ఉన్నందున మెట్పల్లి నుండి ఇతర గ్రామాల వైపుగా వెళ్లేవారు వాగును దాటే ప్రయత్నం చేయవద్దని, అక్కడ ఉన్న గ్రామస్తులకు, గ్రామపంచాయతీ సిబ్బందిని సూచించారు. ఎస్పీ వెంట కాగజ్ నగర్ డీఎస్పీ రామానుజం, కాగజ్ నగర్ రూరల్ సీఐ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.