108,102 అంబులెన్స్ లను తనిఖీ చేసిన జిల్లా మేనేజర్ తిరుపతి
05-09-2025 07:31 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ లోని ఈయమ్ఈ 108, 102, 1962 అంబులెన్స్ వాహనాలను శుక్రవారం కామారెడ్డి జిల్లా మేనేజర్ తిరుపతి ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. అన్ని అంబులెన్సుల యందు పరికరాలను తనిఖీ చేసారు. ఉద్యోగులకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు.






