17-12-2025 05:51:08 PM
నిర్మల్ (విజయక్రాంతి): ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో నరాల వ్యాధి బీపీ షుగర్ ఇతర జబ్బులతో బాధపడుతున్న వారికి మెడికవర్ హాస్పిటల్ లో అవగాహన, ఉచిత పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా సమన్వయకర్త రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. జిల్లాలో పెరిగిపోతున్న నరాల వ్యాధి నివారణ పద్ధతులపై ప్రజల్లో అవగాహన పెంచి వ్యాధితో బాధపడుతున్న వారికి హైదరాబాదులో మెడికవర్ హాస్పిటల్ సిబ్బంది డాక్టర్ అజయ్ డాక్టర్ ముహూర్ వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేయడం జరిగిందని తెలిపారు. పేద ప్రజలకు సేవ భావంతో మెడికవర్ హాస్పిటల్ పని చేస్తుందని ఆయన పేర్కొన్నారు.