విష జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
05-08-2025 08:42 PM
డిఎంహెచ్ఓ ధన్ రాజ్
చేర్యాల: వర్షాలు కురుస్తున్న సందర్బంగా విష జ్వరాల పట్ల ప్రభిలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట జిల్లా డిఎంహెచ్ఓ ధన్ రాజ్ కోరారు. మంగళవారం మద్దూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రిలో ఉన్న రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాకాలం దృశ్య ఆశా కార్యకర్తలు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని గ్రామంలో ఎప్పటికప్పుడు డ్రైడే నిర్వహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రజిత తదితరులున్నారు.






