05-08-2025 11:23:33 PM
మందమర్రి,(విజయక్రాంతి): పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని అందుగులపేట ఫ్లైఓవర్ వంతెన పై జరిగిన రోడ్డు ప్రమాదంలో కూనారపు వంశీ (32) మృతి చెందాడు. పట్టణ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా డోర్నకల్ కు చెందిన కునారపు వంశీ తన అత్తమ్మ ఊరైన ఐబి తాండూర్ కు తన ద్విచక్ర వాహనంపై వస్తున్న క్రమంలో సోమవారం రాత్రి పట్టణంలోని మేడారం ఫ్లైఓవర్ వంతెనపై తన ద్విచక్ర వాహనాన్నీ పక్కకు ఆపి ఉండగా, మంచిర్యాల వైపు అతివేగంగా వెళ్తున్న లారీని డ్రైవర్, అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా నడుపుతూ ద్విచక్ర వాహనాన్ని వెనక నుండి ఢీ కొట్టగా బాధితునికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు మృతి చెందీనట్లు తెలిపారు.కాగా మృతునికి భార్యతో పాటు ఐదు నెలల బాబు ఉన్నారు. ఈ మేరకు మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్ఐ ఎస్ రాజశేఖర్ తెలిపారు.