15 June, 2026 | 7:54 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

విజయవంతంగా ముగిసిన పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్

05-08-2025 11:33 PM

గచ్చిబౌలి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర పారా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన 2వ రాష్ట్ర స్థాయి పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ విజయవంతంగా ముగిసింది. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన 200కు పైగా అథ్లెట్లు జూనియర్, సబ్ జూనియర్  విభాగాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర క్రీడాధికార సంస్థ (SATS) చైర్మన్ శివసేన రెడ్డి, పారా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు విశ్లావత్ శేఖర్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా శివసేన రెడ్డి మాట్లాడుతూ పారా అథ్లెట్ల పట్టుదల, ప్రదర్శనలు ఎంతో ప్రేరణాత్మకంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, SATS పారా క్రీడల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తుంది అని అన్నారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో 100, 200, 400, 800, 1500 మీటర్ల రన్నింగ్ తో పాటు షాట్ పుట్, జావెలిన్ త్రో, హై జంప్, లాంగ్ జంప్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించగా, విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన వాలంటీర్లు, అధికారులు, ఇతర శాఖల సహకారానికి నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఛాంపియన్‌షిప్ ద్వారా పారా అథ్లెట్ల ప్రతిభకు నూతన వేదికను అందిస్తూ, తెలంగాణ రాష్ట్ర పారా అథ్లెటిక్స్ అసోసియేషన్ మరో మైలురాయిని సాధించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.