9 April, 2026 | 10:23 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

ఏటూరునాగారం ఐటీడీఏను తరలించొద్దు

28-10-2025 12:00 AM

ఆదివాసి సంఘాల జేఏసీ చైర్మన్ పూనెం శ్రీనివాస్

ఏటూరునాగారం, అక్టోబరు27 (విజయక్రాంతి): ఆదివాసి సంఘాల జేఏసీ అత్యవసర సమావేశం ఈరోజు ఏటూరునాగారం ఐటిడిఎ ప్రాంగణంలో తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్ అధ్యక్ష తన నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన జేఏసీ చైర్మన్ పూనెం శ్రీనివాస్ మాట్లాడుతూ ఏటూరు నాగారం ఐటిడిఎ భవనం పాత బడి పోయింది అనే కారణంతో జంబోరి గ్రౌండ్ స్థలంలోకి మార్చే ప్రయ త్నాన్ని విరమించుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

క్రాస్ రోడ్డులో ఉన్న ఐటిడిఎతో ఆదివా సీలకి ఒక చారిత్రక గుర్తింపు ఉందని, ఆ గుర్తింపుని కనుమరుగు చెసే ఆలోచనను మానుకోవాలని హిత వు పలికారు. నూతన ఐటిడిఎ ప్రాంగణం నిర్మించడానికి ప్రస్తుతం ఉన్న ఐటిడిఎ స్థలంతో పాటు, ప్రక్కనే ఉన్న స్థలాన్ని కూడా ఉప యోగించు కోవచ్చు అన్నారు. నూత న ఐటిడిఎ ప్రాంగణంతో పాటు గిరిజన మ్యూజియం కూడా ఏర్పా టు చేయాలని, ఆదివాసి ప్రజల అభిప్రాయం మేరకు ప్రస్తుతం ఉన్న చోటే నూతన ఐటిడిఎ నిర్మాణం కూడా చేయాలని ప్రభుత్వానికి సూచించారు.