9 April, 2026 | 8:38 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

మాక్లూర్ ప్రభుత్వ పాఠశాల భవనం ప్రారంభోత్సవం

28-10-2025 12:00 AM

బీగాల గంగారం జ్ఞాపకార్థం మనుమడు బిగల గణేష్ గుప్తా రూ. కోటి విరాళం 

నిజామాబాద్, అక్టోబర్ 27 (విజయ క్రాంతి): నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా  తండ్రి బిగాల కృష్ణమూర్తి, తాత బిగాల గంగారం జ్ఞాపకార్థం కోటి రూపాయల సొంత నిధులు, పాఠశాల భవన నిర్మాణానికి అభివృద్ధికై ఇచ్చారు. విద్యాశాఖ ఈ నిధులు రూ.5.70 కోట్లతో నిర్మించిన పాఠశాలలను సోమవారం ప్రారంభించారు. రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి  ప్రారంభోత్సవం చేశారు.

ఈ భవనాలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనానికి బిగాల కృష్ణమూర్తి, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనానికి బిగాల గంగారం అని నామకరణం చేశారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి బిగాల గణేశ్ గుప్తా, బిగాల మహేశ్ గుప్తా సోదరులను అభినందించారు. కార్యక్రమంలో నిజామాబాద్ మాజీ మేయర్ నీతూకిరణ్, మాజీ జడ్పీ ఛైర్మన్ విఠల్ రావు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి, ఎమ్మెల్యేలు పైడి రాకేశ్ రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజామాబాద్ ఆర్మూర్,మాక్లూర్ మండల కేంద్రంలో సోమవారం జడ్పీహెచ్‌ఎస్, ఎం పీపీ ఎస్ పాఠశాలలకు సంబంధించి నూతన సముదాయాలను  ప్రారంభించారు.