11-07-2025 12:30:49 AM
మంచిర్యాల, జూలై 10 (విజయక్రాంతి) : విద్యా రంగంలో 27 ఏండ్లుగా సేవలందిస్తున్న విద్యావేత్త రాపోలు విష్ణువర్ధన్ రావుకి హోప్ థియోలాజికల్ యూనివర్సిటీ ప్రతినిధులు డాక్టరేట్ అందజేశారు.
సంఘ బలో పేతానికి చేసిన కృషి, కరోనా కాలంలో అందించిన సేవలను గుర్తించి యూనివర్సిటీ ప్రతినిధులు విష్ణువర్ధన్ రావుకి డాక్టరేట్ పురస్కారం అందజేశారు. డాక్టరేట్ అందుకున్న విష్ణువర్ధన్ రావును జిల్లాలోని విద్యా సంస్థల యాజమాన్యాలు పుష్పగుచ్చాలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.