calender_icon.png 12 July, 2025 | 1:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలను కోటిశ్వరులని చెయ్యడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం

11-07-2025 09:15:40 PM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ,(విజయక్రాంతి): కాజీపేట్ ఫాతిమానగర్ బాలవికాస భవనంలో మెప్మా ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అదితిగా పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హజరైయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు కోటి మంది మహిళలను కోటిశ్వరులను చెయ్యడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం.

ప్రభుత్వం మహిళా సాధికారాతకు కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రూ.2 కోట్ల 40 లక్షల చెక్కును స్వయం ఉపాధిత సంఘాలకు అందజేయ్యడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. యూనియన్ బ్యాంకు వారు ముందుకొచ్చి ఇలాంటి మంచి కార్యక్రమాలకు సహకారం అందించినందుకు వారిని అభినదించారు. ప్రజా పాలనలో ప్రతి మహిళా ఒక ఇందిరా గాంధీ లాంటి శక్తివంతమైన మహిళగా ఎదగాలని ఆకాంక్షించారు.