calender_icon.png 13 October, 2025 | 10:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దు: ఎస్పీ రాజేష్ చంద్ర

13-10-2025 07:23:04 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): పోలీస్ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా బిబిపేట పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ లతో మాట్లాడారు. విధులను నిర్లక్ష్యం చేయకుండా విధులు నిర్వహించాలని సూచించారు. పోలీస్ పరేడ్ను స్వీకరించారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్లలో కానిస్టేబుల్ ల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. నైపుణ్యంతో సమగ్రంగా విచారించి ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రతి పోలీస్ అధికారిపై ఉందన్నారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వివరించాలని సూచించారు.

ఫిర్యాదులపై వేగంగా స్పందించి తక్షణమే పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. బ్లూ కోర్ట్ పెట్రో కార్ సిబ్బంది విధుల్లో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద చర్యలపై వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. అనుమానితుల ప్రతి కదలికపై నిగా పెట్టాలని సూచించారు. నేరాల అదుపుకు పటిష్టమైన గస్తీ పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. వి విజిబుల్ పోలింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని విపిఓ లు తమకు కేటాయించిన గ్రామాలను తరచు సందర్శిస్తూ సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. ప్రజల లక్ష్మీదేవి గా భావిస్తూ పోలీసులు విధుల్లో నిబద్ధత చూపాలన్నారు.

డయల్ హండ్రెడ్ ద్వారా అందే ఫిర్యాదులపై వేగంగా సమర్థవంతంగా స్పందిస్తూ ప్రజలకు విశ్వాసం కలిగించేలా వ్యవహరించాలని అధికారులకు సిబ్బందికి సూచించారు. ప్రజల రక్షణ ధ్యేయంగా భావిస్తూ విధుల్లో నిబద్ధత పాటించాలన్నారు. నేరాలను చేదించడానికి కీలకంగా ఉపయోగపడే సీసీ కెమెరాలు ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ను ఏర్పాటు చేసుకున్న విధంగా చూడాలన్నారు. ఎస్పీ రాజేష్ చంద్రన్న తో పాటు కామారెడ్డి అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.