11 April, 2026 | 12:34 PM

Breaking News

రూ.10 కోట్ల మోసం— సింగర్‌ మంగ్లీపై కేసు నమోదు   •   సమయోచిత చర్యలతో గ్రామానికి నీటి భద్రత   •   భాగిర్తిపల్లిలో ఇందిరమ్మ గృహ ప్రవేశం   •   మహాత్మా జ్యోతిరావు పూలే కు ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్   •   ముత్తారంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే   •   పోటు రంగారావుపై NIA ఉపా చట్టం కేసు ఎత్తివేయాలి ‌‌   •   మంగళ్‌హాట్‌లో కార్డెన్ సెర్చ్— గ్యాస్ సిలిండర్లు, బైకులు స్వాధీనం   •   ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన   •   కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •  

సీఎస్ ఐ కరీంనగర్ రీజియన్ వైస్ చైర్మన్ గా సొల్లు సుదర్శన్

13-10-2025 07:20 PM

హుజూరాబాద్,(విజయక్రాంతి): సీఎస్ఐ కరీంనగర్ రీజియన్ వైస్ చైర్మన్ గా కరీంనగర్ జిల్లాహుజూరాబాద్ పట్టణానికి చెందిన సొల్లు సుదర్శన్ రెండో సారి ఎన్నికయ్యారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాలను కరీంనగర్ రీజియన్ గా పరిగణిస్తారు. సోమవారం కరీంనగర్ లోని సిఎస్ఐ చర్చిలో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలో సొల్లు సుదర్శన్ కు 266 ఓట్లకు గాను 236 ఓట్లు రాగా వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. చైర్మన్ గా బిషప్ వ్యవహరిస్తారు. సెక్రటరీలుగా పురుషోత్తం, ఎర్ర జాకబ్, ట్రెజరరీగా రాము ఇమ్మాన్యూయేల్ ఎన్నికయ్యారు. సొల్లు సుదర్శన్ ఎన్నిక పట్ల తన కుమారుడు సొల్లు థామస్, సొల్లు బాబు, పుష్పలత తోపాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు.