10-10-2025 12:25:00 AM
బోథ్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): రైతు లు పండించిన పత్తి పంటలు అమ్ముకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన కపాస్ కిసాన్ యాప్ను జిల్లాలో పలువురు రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఈ యాప్పై ఇప్పటి రైతుల్లో గందరగోళం నెలకొనగా తా జా, జిల్లాలోని సొనాల మండలం చింతల్ బోరి గ్రామ రైతులు సీసీఐ ద్వారా ప్రవేశపెట్టి న కపాస్ కిసాన్ యాప్ను బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ మేరకు గురువారం వ్యవసాయ శాఖ అధికారికి రైతులు వినతిపత్రం అందించారు. ఈ యాప్ రైతుల పాలిట శాపంగా మారిందని రైతులు విమర్శించారు. ఈ యాప్ వినియోగంలో నిరక్షరాస్యులైన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ యాప్ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ కపా స్ కిసాన్ యాప్ను బ్యాన్ చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.