15 April, 2026 | 12:10 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

నాకు టికెట్ రాకుండా చేసిందెవరో త్వరలో చెబుతా: అంజన్ కుమార్

10-10-2025 11:34 AM

హైదరాబాద్: అంజన్ కుమార్ యాదవ్(Anjan Kumar Yadav)తో కాంగ్రెస్ బుజ్జగింపులు ప్రారంభించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో(Jubilee Hills by election) టికెట్ రాకపోవడంతో అంజన్ కుమార్ అలిగారు. ఈ నేపథ్యంలోనే అంజన్ కుమార్ తో మంత్రి వివేక్ భేటీ అయ్యారు. అంజన్ కుమార్ యాదవ్ సీనియర్ నేత అని వివేక్ పేర్కొన్నారు. అంజన్ కుమార్ టికెట్ రాకపోవడంపై అలిగారని చెప్పారు. కాంగ్రెస్ కోసం అంజన్ కుమార్ కుటుంబం కష్టపడిందని వెల్లడించారు. అంజన్ కుమార్ కు పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్నారు. జూబ్లీహిల్స్ లో రాజకీయ పరిస్థితుల ఆధారంగా నవీన్ కుమార్ యాదవ్ కు టికెట్ ఇచ్చారని మంత్రి వివేక్ స్పష్టం చేశారు. 

అటు అంజన్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ... కార్యకర్తలతో భేటీ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. 40 ఏళ్ల నుంచి నేను పార్టీలో ఉన్నానని తెలిపారు. మనోభావాలు దెబ్బతిన్న చాలామంది నా దగ్గరకు వస్తున్నారని చెప్పారు. నాకు టికెట్ రాకుండా చేసిందెవరో త్వరలో చెబుతా అన్నారు. నా హక్కుల కోసం నేను మాట్లాడొద్దా?, ఉప ఎన్నికలో పోటీ చేయడానికి నేను అర్హుడినా.. కాదా?, కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసింది ఎవరు?, అభ్యర్థి ఎంపికలోనూ తనను సంప్రదించరా?, ఇప్పుడు మాత్రమే లోకల్, నాన్ లోకల్ ఇష్యూ ఎందుకు వచ్చింది?, గతంలో కామారెడ్డిలో పోటీ చేసినప్పుడు ఇది గుర్తుకు రాలేదా? అంటూ అంజన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పలు ప్రశ్నలు సంధించారు. కనీసం జూబ్లీహిల్స్ కమిటీలోకైనా నన్ను తీసుకున్నారా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లు తొక్కుకుంటూ పోతే, మేం ఎక్కుకుంటూ పోతామని అంజన్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.