17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

తట్టి అన్నారంలోని హైడ్రా దూకుడు

10-10-2025 12:14 PM

పార్కు స్థలం కబ్జాపై స్థానికుల కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు 

ఆ అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రాధికారులు

అబ్దుల్లాపూర్ మెట్:  తట్టి అన్నారంలోని హైడ్రా(Hydra) దూకుడు పెంచింది. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. ఓ కబ్జా దారుడి ఆటకట్టించింది. కబ్జా కోరులకు చెంపపెట్టు లాంటి చర్యలు చేపట్టింది హైడ్రా... రంగారెడ్డి జిల్లా,  పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ పరిధిలోని తట్టి అన్నారం గ్రామం లక్ష్మీ గణపతి కాలనీలోనీ 700 గజాల పార్క్ స్థలాన్ని ఓ పార్టీ నాయకుడు అనంతుల వెంకటేశ్వర్ రెడ్డి కబ్జా చేశాడు. కాలనీ పెద్దల సహకారంతోనే కబ్జా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా కాలనీ వాసులు భూ కబ్జా వ్యవహారంపై హైడ్రా కమీషనర్ రంగనాథ్(HYDRA Commissioner AV Ranganath)కు పిర్యాదు చేశారు. దీంతో సమగ్ర విచారణ చేపట్టి కబ్జా జరిగింది వాస్తవమేననీ హైడ్రా అధికారులు ధృవీకరించారు. కబ్జా బాగోతంపై సీరియస్ అయ్యారు. ఆ  అక్రమ నిర్మాణాలను శుక్రవారం ఉదయం కూల్చేశారు. కబ్జాకు గురైన ఖరీదైన స్థలాన్ని ప్రభుత్వానికి అప్పజెప్పారు. హైడ్రా చర్యలతో లక్ష్మీ గణపతి కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.