06-05-2025 12:00:00 AM
ఆమధ్య భారతంలో జనవరి 2024 నుంచి ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న ఉద్యమకారుల ఆదివాసీల హత్యాకాండకు వ్యతిరేకంగా ప్రజ లు ప్రజాస్వామిక వాదులు, న్యాయవాదు లు, న్యాయమూర్తులు, వైద్యులు, పత్రికా సంపాదకులు అందరు శాంతిచర్చలు కొనసాగాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు. ఇందులో భాగంగానే మావోయిస్టు పార్టీ శాంతిచర్చలకు సిద్ధమని, కాల్పుల విరమణ పాటిస్తానని నెల క్రితమే ప్రకటన చేసింది.
కాని, కేంద్ర ప్రభుత్వం స్పందించకుండానే నేటికి కూ డా నరసంహారాన్ని ఎన్కౌంటర్ రూపం లో కొనసాగిస్తూ ఉన్నది. ఈ 16 నెలల కా లంలో 52 ఎన్కౌంటర్లలో 480 మందిని హత్య చేసిన స్థితి ఉన్నది. ప్రభుత్వానికి నక్సలైట్లకు మధ్య నిజమైన ఎన్కౌంటర్ అయితే ప్రజలు, ప్రజాస్వామిక వాదులు చర్చలకోసం ప్రయత్నించేవాళ్ళే కాదు కాని, ఆపరేషన్ కగార్ పేరుతో లక్షలాది బలగాలతో వందలాది క్యాంపులను ఏర్పాటుచేసి ఆదివాసీలను, ఉద్యమకారులను ఎన్కౌంటర్ పేరుతో హత్య చేస్తున్నారు. ప్రజాస్వామిక దేశంలో ఒక బలమైన రా జ్యాంగం అమలు కావాల్సిన స్థితిలో ఇటువంటి హత్యాకాండలు ఉండకూడదు.
ఈ ప్రజాస్వామిక దేశంలో ఒక బలమైన న్యా యవ్యవస్థ కూడా ఉన్నది. ఆ వ్యవస్థను గు ర్తించకుండా ప్రభుత్వాలే ‘నిర్మూలిస్తాం, హత్యలు చేస్తాం’ అని సాయుధ బలగాలతో ఆదివాసీల, ఉద్యమకారుల వేటను కొనసాగించడాన్ని హక్కుల సంఘాలుగా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మధ్యభారతంలోని కోట్లాది విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పగించడం కో సం ఆదివాసీ జాతినే హననం చేయడం, వారికి అండగా ఉన్న మావోయిస్టులను అంతమొందించడమే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ అణచివేత కొనసాగుతున్నది. 2005 సల్వాజుడుం నుంచి ఆదివాసీల వేట కొనసాగుతూ ఉన్నది.
నేటికి సుమా రు 16,000లకు పైగా ఎన్కౌంటర్ హత్యాకాండ కొనసాగింది. ఇటువంటి హత్యలు ఉండవద్దనే 90వ దశకంలో ఎస్ఆర్ శంకరన్ నేతృత్వంలో పౌరస్పందన వేదిక ఏర్పడి 2004లో వైఎస్ఆర్ ప్రభుత్వంతో పీపుల్స్వార్ పార్టీ చర్చలు జరిపి 6 నెలల శాంతి కాలాన్ని ప్రజలకు అందించింది. చర్చల ప్రక్రియ ఎప్పుడు ముందుకు వ స్తుందంటే ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఎన్కౌంటర్ పేరుతో హత్యాకాండ కొనసాగించిన చోట చర్చలు ఒక ప్రజాస్వామిక హక్కుగా ప్రజల డిమాండుగా ముందుకొస్తాయి.
ఏ ఎన్కౌంటర్పై కూడా ఏ రాష్ట్రంలోనూ సరైన న్యాయవిచారణ జరగకుండానే కేసులు మూతబడి పోతున్నాయి. దీంతో ప్రభుత్వాలు యధేచ్ఛగా పోలీసు బలగాలతో కాల్చి చంపించి ఎన్కౌంటర్గా ప్రకటిస్తున్నాయి. అందుకు అనేక మిలిట్రీ ఆపరేషన్ల పేర్లను సాకుగా వాడుతున్నాయి.
కానీ, ఇదే ఎన్కౌంటర్ హత్యాకాండకు వ్యతిరేకంగా ఉమ్మడి ఆం ధ్రప్రదేశ్లో 1997లో కన్నాభిరాన్ ఆధ్వర్యంలో న్యాయస్థానంలో పోరాటం ప్రారంభించారు. దాని తీర్పులో భాగంగా 6 ఫిబ్రవరి 2009లో ఉమ్మడి ఏపీ విస్తృత ధర్మాసనం ఒక బలమైన తీర్పును ప్రకటించింది. ఇది వెలువడిన 6 నెలల కాలం అంటే ఆ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చేంత వరకు ఎన్కౌంటర్లు జరగలేదు.
ఆ తరువాత 2014లో పీయుసీఎల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో 16 గైడ్లైన్స్లో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కూడా ఖరారు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీర్పును వెనక్కి నెట్టేసింది. ఈ ఎన్కౌంటర్ల నేపథ్యంలోనే ఎన్టీ రామారావు కాలంలో 1989లో ఆ ఏడాదే అత్యంత ఎక్కువగా 275 ఎన్కౌంటర్ హత్యలు జరిగాయి. ఆ నేపథ్యంలోనే తెలంగాణలోని యువత ఎన్కౌంటర్ పేరుతో కాల్చి చంపబడుతు న్న స్థితిలోనే ఎస్ఆర్ శంకరన్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చేసిన దశాబ్దకాల కృషిలో భాగంగానే 2004లో వైఎస్ఆర్ ప్రభుత్వానికి పీపుల్స్వార్ పార్టీకి మధ్య శాంతి చర్చలు జరిగాయి.
కానీ, వాటిల్లో కీలక భూమికను పోషించిన భూమి విషయం వచ్చేసరికి రెండవ దఫా చర్చల్లో పరిష్కరించుకుందామని మొదటి దఫా చర్చలను ముగించారు. రెండవ దఫా చర్చలేమో కా నీ మళ్ళీ నల్లమల అంతా రక్తం ఏరులై పారి చర్చల వాతావరణమే లేకుండా పో యింది. నేటి పరిస్థితి కూడా రాజ్యమే ఆదివాసులను ఉద్యమకారులను నర సంహా రం కొనసాగిస్తూ 15 నెలల కాలంలో 500 మందికి పైగా హత్య చేసినప్పటికి ఎంతోమంది బుద్ధిజీవులు
,మేధావులు శాంతిచర్చల కోసం ప్రయత్నిస్తే హింసాకారులుగా ప్రభుత్వం ప్రచారం చేస్తున్న మా వోయిస్టు పార్టీ ముందుకు వచ్చి చర్చలకు సిద్ధమని ప్రకటించి నెల రోజులు గడుస్తు న్నా స్పందించకుండా ఉంది. ప్రభుత్వాలే హింసను నమ్ముకొని గత రెండున్నర దశాబ్దాలుగా ప్రజలందరికీ తెలిసేలా పాల న చేస్తున్నాయన్నదే మధ్యభారతంలో కొనసాగిస్తున్న హత్యాకాండతో అర్థమవుతున్నది.
అఖిల భారత స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాలలోనూ శాంతిచర్చలపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో 26 ఏప్రిల్ 2025న తెలంగాణలోని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ఆపరేషన్ కగార్ను ఆపాలని, మావోయిస్టు పార్టీ చర్చలకు సిద్ధమని ప్రకటించిన నేపథ్యంలో చర్చలు కూడా కొన సాగించాలని లక్షలాది జనం ముందు కేసీఆర్ ప్రకటించారు. అంతేకాక సుమారుగా అన్ని వామపక్ష పార్టీలూ చర్చలకే సిద్ధమని తమ అభిప్రాయాన్ని ఒక పక్క ప్రకటిస్తూనే ఉన్నారు. ఇది నిజంగా ఒక ప్రజాస్వామ్య దేశంలో మనుషులను ఎన్ కౌంటర్ పేరు తో వేటాడి హత్య చేయడమనేది సరైంది కాదు.
అది మన రాజ్యాంగమూ ఒప్పుకో దు. బుద్ధిజీవులు, ప్రజాస్వామిక వాదులు, ప్రతిపక్ష పార్టీలు విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, విద్యార్థులు చర్చలు జరపాలని ఆపరేషన్ కగార్ను ఆపాలని పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. అందులో భాగంగానే నిన్న ఉస్మానియా యూనివర్సిటీలోనూ విద్యార్థులు శాంతిచర్చల ప్రక్రియను కొనసాగించాలని, ఆపరేషన్ కగార్ను నిలిపి వేయాలని నినదించారు. పౌరహక్కుల సంఘంగా మేము ఒక అడుగు ముందుకు వేసి ఇప్పటికే మధ్యభారతంలో 600 క్యాంపులతో 7 లక్షల పారా మిలిట్రీ బలగాలను ఆ ప్రాంతం నుంచి వెనక్కి తీసుకోవడం ద్వారానే చర్చల ప్రక్రియకు మధ్య భారతంతో శాంతిని నెలకొల్పడానికి అవకాశం ఉంటుంది.
ఆవైపుగా ప్రభుత్వం ఆ లోచించక పోతే ప్రజాస్వామ్యమని, రా జ్యాంగమని చెబుతూ అధికారంలోకి రావ డం, వచ్చాక వాటిని ఖాతరు చేయకుండా కేవలం కార్పొరేట్లకు ఖనిజ సంపదను అం దించడం కోసం మధ్యభారతంలో ఆదివాసీ జాతిని నిర్మూలించాలనే బలమైన ప్రణాళికతో ఆపరేషన్ కగార్ను ప్రకటించి ఇప్పటికే నాలుగైదుసార్లుగా మావోయిస్టులను పూర్తిస్థాయిలో నిర్మూలిస్తానని 26 మార్చి 2025న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ప్రకటించడం ప్రజాస్వామిక వ్య వస్థలో న్యాయవ్యవస్థ కూడా కీలకంగా ఉంటుందనే ప్రధాన విషయాన్ని పక్కకు నెట్టేసి ‘మేము ఎవరివైనా చంపుతామని’ స్పష్టంగా ప్రకటిస్తే ఇక రాజ్యానికి విలువ లేని స్థితిలో ప్రజాస్వామ్యం గురించి ఎవ రు మాట్లాడతారు! ప్రజాస్వామ్యం,
రాజ్యాంగం లేకపోతే బీజేపీ ప్రభుత్వానికి మూడుసార్లు అధికారంలోకి రావడానికి అవకాశాలే లేవు. కాబట్టి, రాజ్యాంగాన్ని విశ్వసించి పరిపాలన చేస్తున్న ప్రభుత్వాలుగా ప్రజాస్వామ్యబద్ధంగా మీ పరిపాలన లేకపోతే ప్రజలు తిరుగుబాటు చేయడం ఖాయం. అది సాయుధ పోరాటంగా వ స్తుందా, ప్రజాస్వామ్య పోరాటంగా వస్తుం దా ఎవరమూ ఊహించలేం. ఆ స్థితికి దేశ ఆర్థిక సామాజిక పరిస్థితులను ప్రభుత్వాలు నెట్టకుండా ఉంటే బాగుంటుంది. ఇప్పటికైనా బుద్ధిజీవులు, మేధావులు కోరిక మేరకు అన్ని ప్రతిపక్ష పార్టీల ఒత్తిడి మేరకు శాంతిచర్చలు జరిపి ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పాలి.
ఎన్. నారాయణ రావు, ప్రధాన కార్యదర్శి, పౌర హక్కుల సంఘం