08-06-2025 12:35:53 AM
హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలం గాణ (దోస్త్) రెండో ఫేజ్ రిజిస్ట్రేషన్ల గడువు రేపటితో ముగియనున్నది. ఈనెల 13న రెండో విడత డిగ్రీ సీట్ల ను కేటాయించనున్నారు. తొలి విడ త సీట్ల కేటాయింపులో 89,572 మంది దరఖాస్తు చేసుకోగా.. 60, 436 మంది అభ్యర్థులు సీట్లను పొందిన విషయం తెలిసిందే. 805 కాలేజీల్లో 3,71,096 మొత్తం సీట్లలో 60,436 సీట్లు పోగా మిగిలిన సీట్లను రెండో విడతలో కేటాయించనున్నారు.