08-06-2025 12:29:31 AM
ది సిటిజన్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి ఉపేంద్రనాథ్రెడ్డి
మణికొండ, జూన్ 7: అక్రమ వసూళ్ల కోసం తాము ఎవరినీ బెదిరించలేదని ది సి టిజన్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి ఉపేంద్రనాథ్రెడ్డి, మణికొండ నివాసి ప్రభాకర్రెడ్డి తె లిపారు. శనివారం డాలర్ హిల్స్ కాలనీలో ని ది సిటిజన్ కౌన్సిల్ కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన మీడియా సమావేశంలో వా రు మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ.. “నా ప్లాంటుకు సంబంధించిన డబ్బుల విషయంలో మాట్లాడేందు కు బిల్డర్ పీఎన్ సురేష్ ఇంటికి వెళ్లాను.
అ క్కడ ఎవరినీ బెదిరించలేదు. మేము ఎ లా ంటి బెదిరింపులకు పాల్పడలేదు” అని తెలిపారు. తాము బిల్డర్పై బెదిరింపులకు పాల్పడినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ప్రభాకర్ ఖ ండించారు. “మా డబ్బులు మాకు ఇవ్వాలని కోరుతున్నాని, ఆ డబ్బులకు సంబంధించిన చెక్కుల ను బిల్డర్ సురేష్ తిరిగి ఇచ్చారని ఆ యన తెలిపారు. ఈ చెక్కులను అడిగేందుకే బిల్డర్ సురేష్ కార్యాలయానికి వెళ్లామని ప్ర భాకర్రెడ్డి చెప్పారు.
ఉపేంద్రనాథ్రెడ్డి మా ట్లాడు తూ.. “కొంతమంది మా కౌన్సిల్కు చె డ్డపేరు తెచ్చేలా కుట్ర చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిం ది. మా సభ్యులు ఎక్కడా ఎలాంటి అక్రమ వసూళ్లకు పాల్పడటం లేదు. కొన్ని వాట్సాప్ గ్రూప్స్లో మాత్రం ప్రైవేట్ వ్యక్తుల వ్యవహారాల్లో మా సభ్యులు జోక్యం చేసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అవన్నీ అవాస్తవం” అని అన్నారు.