20-06-2025 11:27:11 AM
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో స్థానికులు అడవి నుంచి కాలనీలోకి వచ్చిన చుక్కల దుప్పిని కాపాడి అటవీశాఖ అధికారులకు అప్పగించారు. శుక్రవారం ఉదయం కాలనీ పక్కనే ఉన్న అటవీ ప్రాంతం నుంచి కాలనీలోకి వచ్చిన చుక్కల దుప్పి నీ కుక్కలు వెంటాడగా స్థానికులు దానిని కాపాడి అటవీ శాఖ అధికారులకు(forest department officials) సమాచారం ఇచ్చారు. అధికారులు అక్కడికి వచ్చి చుక్కల దుప్పిని తీసుకువెళ్లి అడవిలో విడిచిపెట్టారు.