15 April, 2026 | 12:57 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

డా.శ్రీనివాస్‌కు ‘విజయ్ సమాన్’ పురస్కారం

05-12-2025 12:00 AM

నంగునూరు, డిసెంబర్ 04:దంత వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తున్న సిద్దిపేటకు చెందిన ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ నాయక్ ప్రతిష్టాత్మక ’విజయ్ సమాన్’ పురస్కారం వరించింది.నిస్వార్థ సేవలకు తమ వృత్తి నైపుణ్యంతో పాటు సామాజిక సేవకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారు.సిద్దిపేటలో శ్రీనివాసా సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాలను విజయవంతంగా నిర్వహిస్తున్న డాక్టర్ శ్రీనివాస్ నాయక్, అత్యాధునిక దంత వైద్య సేవలను ప్రజలకు అందిస్తున్నారు.

కేవలం క్లినిక్కే పరిమితం కాకుండా,తమ వైద్య వృత్తిలో సామాజిక బాధ్యతను విస్మరించకుండా ,తమ సొంత నంగునూరు మండలం గ్రామం సీతారాంపల్లి తండా (గట్లమల్యాల) తో జిల్లాతో సహా అనేక మారుమూల ప్రాంతాలు,తండాల్లో తరచూ ఉచిత దంత వైద్య శిబిరాలు,ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.డా.శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ..మారుమూల ప్రాంతాల ప్రజలను ఎన్నటికీ మర్చిపోనుఆని,పట్టణంలో ఆధునిక వైద్యం అందించడంతో పాటు,ఆరోగ్య సేవలు సరిగా అందని తండాలు, గ్రామాల ప్రజలకు దంత వైద్యం గురించి సరైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత చాలా ఆనందంగా ఉందన్నారు.