calender_icon.png 17 June, 2025 | 12:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

16-06-2025 01:40:51 AM

- పట్టుబడ్డ 283 మంది వాహనదారులు

శేరిలింగంపల్లి, జూన్ 15:సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో శనివారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు పోలీసులు. ఈ తనిఖీలో 283 మంది మందుబాబులు మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిలో 219 మంది టూ వీలర్స్, 11 మంది త్రీ వీలర్స్, 50 మంది ఫోర్ వీలర్స్, 3 హెవీ వెహికల్స్ వాహనదారులు ఉన్నారు.

అయితే తనిఖీ ల్లో పట్టుబడిన పట్టుబడిన వారిలో 21-30 ఏళ్లు ఉన్నవారు 98 మంది కాగా.. 31-40 ఏళ్ల మధ్యలో ఉన్నవారు 101 మంది ఉండగా,41- 50 మధ్య వయసులో ఉన్నవారు 60 మంది ఉన్నారు. మొత్తం 283 మందిలో అందరూ పురుషులే ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. పట్టుబడిన ప్రతి ఒక్కరిని కోర్టులో హాజరు పరచనున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ మే రకు మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమై ఇతరుల ప్రాణాలు తీస్తే వారిపై భారతీయ న్యాయ సన్హిత 2023 చట్టం,105 సెక్షన్ కింద గరిష్ఠంగా 10 ఏండ్ల వరకు జైలు శిక్ష,జరిమానా విధించడం జరుగుతుందని పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో భాగంగా డ్రంక్ అండ్ డ్ర్పై ప్రత్యేక దృష్టి సారించామని ఇందులో భాగంగానే వారాంతరాలతో పాటు సాధారణ రోజుల్లో కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు అధికారులు తెలిపారు. మద్యం సేవించి పట్టుబడితే శిక్షలు కఠినంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.