08-11-2025 12:17:54 AM
కరీంనగర్లో కవులు, కళాకారులు, విద్యావేత్తలకు కొదవలేదు
సామాజిక రుగ్మతలపై నివారణకు సమర శంఖం పూరించాలి
మేధావులు విద్యావంతులు సమాజానికి జ్ఞానాన్ని పంచాలి
ఇంటికే పరిమితం కావద్దు మనదేశంలోనే అత్యధికంగా యువత ఉన్నారు
భవిష్యత్తు భావితరానిదే రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా అధికారులు, ప్రముఖ వ్యక్తులతో గవర్నర్ ముఖాముఖి
కరీంనగర్, నవంబర్7(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి ప్ర తి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపునిచ్చారు. కరీంనగర్ ను టీబి, మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.శుక్రవారం కరీంనగర్ జిల్లా పర్యటన పర్యటనలో భాగంగా గవర్నర్ శాతవాహన యూనివర్సిటీలో జరిగిన రెండవ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు.
అనంతరం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా అధికారులు, ప్రముఖ వ్యక్తులతో లతో ము ఖాముఖి నిర్వహించారు.ఈ సందర్భంగా జి ల్లా కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్ జిల్లా సమగ్ర స్వరూపంతో పాటు జిల్లా విశేషాల ను పవర్ ప్రజెంటేషన్ ద్వారా గవర్నర్ కు వివరించారు.జిల్లాలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, జిల్లాలో నీటిపారుదల, వైద్య ఆరో గ్య, విద్య ,
జల్ జీవన్, ప్రధానమంత్రి ఎం ప్లాయిమెంట్ గ్యారెంటీ పథకం, సమగ్ర శిక్ష అభియాన్, భవిత కేంద్రాలు గ్రామ సడక్ యోజన, టిబి ముక్త్ భారత్, ఆయుష్మాన్ భారత్ , గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ, స్వ చ్ఛభారత్, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం, గృహ నిర్మాణం మహాలక్ష్మి పథకం అమలు, ఇందిరమ్మ ఇండ్లు, ఆది కర్మయోగి అభియాన్, తదితర పథకాలపై లెక్కలతో స హా వివరించారు.
జిల్లాలో 777 అంగన్వాడి కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చి న్నారులకు పోషకాహారం అందిస్తున్నామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల పరిధిలో శు క్రవారం సభ నిర్వహిస్తూ మహిళలు పిల్లల పోషణ ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. మహిళా సమస్యల పరిష్కారానికి శుక్రవారం సభ ఒక వేదికగా నిలుస్తోందని తెలిపారు. దివ్యాంగుల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించేందుకు అధికారులకు ప్రభుత్వ సిబ్బందికి సైన్ లాంగ్వేజి లో శిక్షణ ఇచ్చామని తెలిపారు. దీంతో గవర్నర్ మం త్రముగ్ధులై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతినీ గవర్నర్ అభినందించారు.
అనంతరం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ, టి బి వ్యాధి నివారణ కోసము ప్రతి ఒక్కరు బాద్య త తీసుకోవాలనీ, టిబి రాకుండా జాగ్రత్త పడాలనీ, టిబి వ్యాధి నివారణ కోసము చా ల రకాల మందులు వచ్చాయన్నారు. కవులు, రచయితలు, ప్రజా ప్రతినిధులు అం దరిని టీబీ నియంత్రణలో బాగస్వామ్యం చేయాలన్నారు. సబ్ కా వికాస్- సబ్ కా ప్ర యాస్, టి బి నిర్మూలనలో అందరు కష్ట ప డితేనే అందరు ఆరోగ్యంగా ఉంటారనీ, జిల్లాను రోల్ మాడల్ గా తీర్చిదిద్దాలని , అందరికి టిబి లక్షణాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.
దీంతో త్వరగా టిబిని నిర్మూలించవచ్చాన్నారు. టి బి ముక్త్ భారత్ కోసం ప్రతి ఒక్కరు బాద్యతగా వ్యవహరించాలన్నారు. టిబి నిర్మూలనలో జిల్లా ను ఆదర్శంగా నిలపాలని తెలిపారు. జిల్లా లో కవులు, కళాకారులు , రచయితలు వివిధ రంగాలలోని ప్రముఖులను టీబి ముక్త్ భార త్ లో భాగస్వాములను చేసి వారితో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి టీబిని పూర్తి గా నిర్మూలించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.
కరీంనగర్ ను డ్రగ్స్ రహిత జి ల్లాగా అధికారులు ప్రజలు కలిసికట్టుగా నిర్మూలించాలని పేర్కొన్నారు. ఈ రెండు అంశాలపై తో పాటు, మహిళా సాధికారతకు కృషి కృషి చేయాలన్నారు. మేధావులు విద్యావంతులు జ్ఞానాన్ని సమాజానికి పంచాలి.. జిల్లాలో ఉన్న మేధావులు విద్యావంతులు ఇంటికి పరిమితం కాకుండా జ్ఞా నాన్ని సమాజానికి పంచాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచించారు. ప్రపంచంలోనే అ త్యధికంగా మనదేశంలోనే యువత ఉందని రాబోయే రోజుల్లో భవిష్యత్తు భావితరానిదేనని స్పష్టం చేశారు.
దీంతోపాటు సమాజం లో నాటుకున్న సామాజిక రుగ్మతలను రూ పుమాపాలని పిలుపునిచ్చారు. ఇందులో ప్ర ధానంగా వరకట్న సమస్యలు, బాల కార్మిక వ్యవస్థ, శ్రమ దోపిడిని పూర్తిగా నిరోధించాలన్నారు. సామాజిక రుగ్మతలు రూపుమా పితినే భారత్ కు బంగారు భవిష్యత్తు ఉం టుందన్నారు. దృఢమైన భారత్ ను నిర్మించడానికి అందరూ కలిసికట్టుగా నడుంబిం చాలని పిలుపునిచ్చారు.
సమాజ అభివృద్ధికి అందరు పాటుపడాలి..
సమాజ అభివృద్ధికి అందరు పాటుపడాలని కేవలం అధికారుల తోనే కాకుండా ప్రజ లందరి సమిష్టి కృషితో సమాజం అభివృద్ధి చెందుతుందని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పేర్కొన్నారు. కరీంనగర్లో కవులు, కళాకారులకు విద్యావేత్తలకు కొదవ లేదన్నారు. వారి సేవలను జిల్లా అధికారులు ఉపయోగించుకోవాలన్నారు. సమాజంలో సమస్యల పరి ష్కారానికి సమర శంఖం పూరించాలన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐ. టి లే కాకుం డా మనవీయా కోణంతో పని చేయాలి అని అన్నారు. వందేమాతరం గీతం జాతిని ఉ ర్రూతలు ఊగించిందని తెలిపారు. నేటితో వందేమాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తవడం దేశం గర్వించదగ్గ విషయం అ న్నారు. బకిం చంద్ర చటోపాధ్యాయ రాసిన ఈ వందేమాతరం గీతం ప్రజలకు ఎప్పుడు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు.
తెలంగాణలోని అన్ని జిల్లాల్లో తాను విస్తృతంగా పర్యటిస్తున్నానని తెలంగాణ రాష్ట్రం సుసంపన్నమైన రాష్ట్రంగా వెలుగొందుతుందని తె లిపారు. తెలంగాణ ఘనమైన వారసత్వ సం పదతో సంస్కృతికి సంప్రదాయాలతో వెలసిల్లుతున్నదని పేర్కొన్నారు. భారత్ ను అజ య శక్తిగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని గవర్నర్ పిలు పునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు ప్రముఖ వ్యక్తులు పరిచయం చేసుకు న్నారు. ప్రముఖులు వారు చేస్తున్న సామాజిక సేవలు వివిధ కార్యక్రమాలను గవర్నర్ కు వివరించారు.
ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నందుకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా అధికారులను గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణలో కరీంనగర్ జిల్లాకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని ఆ గుర్తింపును జిల్లా కలెక్టర్ యం త్రాంగం మరింత ముందుకు తీసుకుపోవ డం అభినందనీయమని గవర్నర్ ప్రశం సించారు.
ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదే వ్ వర్మను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శాలువా కప్పి ఘనంగాసన్మానించారు. ప్ర ముఖ గాయని, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీమతి శ్రీలేఖ అప్ కి నజరొంనే సంజా హిందీ పా టను స్వయంగా ఆలపించి ఆహుతులను అలకటుకున్నారు.