07-06-2025 12:16:59 AM
బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
కుత్బుల్లాపూర్, జూన్ 6(విజయక్రాంతి): ప్రాధాన్యత క్రమంలో మౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తామని బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 - జీడిమెట్ల డివిజన్ పరిధిలో రుక్మిణీ ఎస్టేట్స్ నందు చేపట్టిన సీసీ రోడ్డును బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ జీడిమెట్ల డివిజన్ తో పాటు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి పరుస్తామన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చెరుకుపల్లి తారా చంద్రా రెడ్డి, రుక్మిణి ఎస్టేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శేఖర్, కాలనీ వాసులు నర్సింహులు, శంకర్ రెడ్డి, శివ కుమార్, స్వామి, నవీన్, సీనియర్ సిటిజన్స్ వె ల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పెద్ది మల్లేశం, కోశాధికారి మురళీ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కుంట సిద్దిరాములు, సుధాకర్ గౌడ్, నరేందర్ రెడ్డి, సమ్మయ్య నేత, ఎల్లా గౌడ్, యేసు, ఆటో బలరాం, నదీమ్ రాయ్, కుంట వేణు, నారాయణ, కాలే గణేష్, శ్రీకాంత్, వి జయ్ హరీష్, బాల మల్లేష్, మహిళా నాయకురాలు అరుణా రెడ్డి, ఇందిరా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.