07-06-2025 12:18:43 AM
సూర్యాపేట జూన్ 6 (విజయక్రాంతి) : ఈ నెల 9 నుండి ఈనెల 21 వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉదయము ,సాయంత్రం రెండు బ్యాచ్ లు గా నిర్వహించే ఉచిత యోగ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట ఉన్నత యోగ శిక్షణ కేంద్రం యోగా గురువు చాడ పాపిరెడ్డి అన్నారు.
శుక్రవారం సంఘ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 6:45 వరకు నిర్మల హాస్పిటల్ రోడ్డు కవి సాగర్ హాస్పిటల్ ప్రక్క బజారులో, సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల 15 నిమిషాల వరకు బ్రాహ్మణ కళ్యాణ మండపం నందు ఈ యోగా శిక్షణ క్లాసులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
యోగా శిక్షణ ద్వారా బిపి ,డయాబెటిస్ నడుమునొప్పి, వెన్నునొప్పి, సయాటికా, మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పి, తలనొప్పి మైగ్రేన్, థైరాయిడ్, ఓ బి సి టి మొదలగు వ్యాధులు, మానసిక సంబంధమైన వ్యాధులు, మహిళలకు రుతు సంబంధిత వ్యాధులు యోగ వల్ల నివారించుకోవచ్చు అన్నారు. కావున ఈ యోగా శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదనపు సమాచారం కోసం 9849804626 నెంబర్ను సంప్రదించాలన్నారు.