07-06-2025 12:16:18 AM
చండూరు, (గట్టుప్పల) జూన్ 6: బక్రీద్ ను ప్రశాంతమైన వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలని గట్టుప్పల ఎస్త్స్ర గుత్తా వెంకటరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. విద్వేషపూరితమైన పోస్టులు పెట్టవద్దని సూచించారు. ఎవరైనా అలాంటి పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా హిందూ, ముస్లింలు అన్నదమ్ముల వలె కలిసిమెలిసి పండుగలు జరుపుకోవాలని, పోలీసుల నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని ఆయన అన్నారు.