15 April, 2026 | 12:17 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

విద్య వైద్యానికి 40 శాతం బడ్జెట్ ఉండాలి

15-11-2025 10:05 PM

యూనివర్సిటీ విద్యాల సమస్య పరిష్కారానికి కృషి..

చట్టసభల్లో విద్యావంతుల సంఖ్య తక్కువే..

ఎమ్మెల్సీ మల్లన్న..

నల్గొండ రూరల్: విద్య వైద్యానికి బడ్జెట్లో 40 శాతం నిధులు కేటాయిస్తూనే పేదల జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. శనివారం నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీని సందర్శించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాడితో కలిసి భోజనం చేశారు మాత్మ గాంధీ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఎలాంటి సమస్య ఉన్న వట్టే జానయ్య కు ఫోన్ చేయాలని సూచించారు. విశ్వవిద్యాలయాలు వేదికగా ఒక విజ్ఞానవంతమైన కొత్త తరం బయటికి వస్తుంది అన్నారు. విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు. 10 పాస్ అయిన వాళ్లే చట్టసభల్లో ఉండడం బాధాకరమన్నారు.

ఉన్నత విద్యావంతులైన యువత చట్ట సభలో అడుగు పెట్టాలన్నారు. దేశ యూనివర్సిటీ గుర్తింపులో మాత్మ గాంధీ యూనివర్సిటీ 557వ ర్యాంకు ఉండడం ఆందోళన కలిగిస్తుంది అన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి మంచి భవిష్యత్తును ఎంచుకోవాలని యూనివర్సిటీకి మంచి గుర్తింపు తీసుకురావాలన్నారు వి సి అల్తాఫ్ హుస్సేన్ రిజిస్టర్ ఆల్వాల్ రవీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ గౌడ్, వట్టే జానయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.