15 April, 2026 | 12:18 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మాసానిపల్లి ఐకెపి కొనుగోలు కేంద్రంలో తీవ్ర ఇబ్బందులు

15-11-2025 10:03 PM

నాగిరెడ్డిపేట్ (విజయక్రాంతి): మండలంలోని మాసానిపల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలులో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్రామస్తులు, రైతులు తెలిపారు. రైతులకు తీవ్ర ఇబ్బందులు కలగజేయడమే కాకుండా ఇష్టానుసారంగా ఐకెపి సీసీ సావిత్రి మాట్లాడుతున్నారని తెలిపారు.వరి ధాన్యం కాంట చేసి ఐదు రోజులు అయితున్నప్పటికీ లారీలు తెప్పించడంలేదని వరి ధాన్యం కొనుగోలు కేంద్రము ఇన్చార్జి సిసి సావిత్రినీ అడుగుతే ఐదు రోజులు అవుతుంది. పది రోజులవుతాదని తిక్క,తిక్క సమాధానాలు చెప్తున్నారని గ్రామస్తులు, రైతులు తెలిపారు. లారీలు రానప్పుడు వరి ధాన్యాన్ని ఐదు రోజుల ముందు కాంటా చేయడం ఎందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు.

కాంట చేసినటువంటి రైతు ధాన్యం సంచుల కోసం రాత్రిపూట నిద్రపోవడం జరుగుతుందని ప్రమాదవశాత్తు రైతులకు ఏమైనా జరుగుతే పూర్తి బాధ్యత ఎవరిదని ఆవేదన వ్యక్తం చేసుకున్నారు.రాత్రి వేళలో క్రిమి కీటకాలు తిరిగే ఆస్కారం ఉందని తెలిపారు.గత ఐదు రోజులుగా కాంత చేసినటువంటి ధాన్యాన్ని లారీలు తెప్పించి తరలించాలని,అలాగే వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కోరుతున్నారు.లారీల ఆలస్యంపై నాగిరెడ్డిపేట్ మండల ప్రెస్ సభ్యులకు,ప్రెస్ గ్రూపుల్లో పెడతాను అని గ్రామ యువ రైతు వినోద్ అడుగుతే మీ ఇష్టం ఉన్న గ్రూపులో పెట్టుకోండి అని సిసి.సావిత్రి తెలిపారన్నారు.