9 April, 2026 | 8:41 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

పురుగుల మందు తాగి వృద్ధురాలి ఆత్మహత్య

15-10-2025 07:41 PM

చిట్యాల (విజయక్రాంతి): జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలకేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్ఐ బోరగాల అశోక్ తెలిపిన వివరాల ప్రకారం మొగుళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన మోరే సముద్రమ్మ(70) వృద్ధురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మోరే సముద్రమ్మ గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంగళవారం సాయంత్రం పురుగుల మందు సేవించింది. గమనించిన కుటుంబ సభ్యులు మృతురాలిని 108 అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం చిట్యాల సివిల్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి కుమారుడు మోరే రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.