9 April, 2026 | 10:28 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

నషా ముక్త్ భారత్ లో పెయింటింగ్ పోటీలు

15-10-2025 07:37 PM

కరీంనగర్ (విజయక్రాంతి): నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహిళలు పిల్లలు దివ్యాంగులు & వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం జూనియర్ కళాశాలల విద్యార్థిని, విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను తెలియపరిచే విధంగా వాల్ పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. కరీంనగర్ పోలీస్ కమీషనర్ కార్యాలయ కాంపౌండ్ గోడపై విద్యార్థులు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే సమస్యలను తమ పెయింటింగ్ ద్వారా వివరించారు. వివిధ కళాశాలలకు చెందిన 17 మంది విద్యార్థిని విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, ఎన్ ఎం బి ఏ కమిటీ సభ్యులు పెండ్యాల కేశవరెడ్డి, మర్రి రాజేందర్, జూనియర్ కాలేజీ, కార్యాలయ సిబ్బంది పోటీలను పర్యవేక్షించారు.