03-12-2025 07:50:29 PM
* అవసరమైన పత్రాలు ముందే సిద్ధం చేసుకోండి చివరి క్షణంలో ఇబ్బందులు పడకండి
* గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్ట భద్రత
జిల్లా కలెక్టర్, ఎస్పీ
గరిడేపల్లి (విజయక్రాంతి): హుజూర్నగర్ నియోజకవర్గంలో సర్పంచి ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకు అందరూ సహకరించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్, ఎస్పీ నరసింహ కోరారు. మండలంలోని గడ్డిపల్లి, పొనుగోడు, గరిడేపల్లి పోలింగ్ స్టేషన్లను వారు పరిశీలించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బుధవారం నుంచి శుక్రవారం వరకు హుజూర్నగర్ నియోజకవర్గంలోని 146 గ్రామ పంచాయతీలకు, 1318 వార్డులకు, 38 క్లస్టర్ల పరిధిలో నామినేషన్స్ స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నామినేషన్ వేసే అభ్యర్థులు ముందస్తుగా అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలని, చివరి క్షణాల్లో ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
నామినేషన్ వేసే సమయంలో సందేహాలు ఉంటే హెల్ప్ డెస్క్ ద్వారా నివృత్తి చేసుకోవాలని కోరారు. నామినేషన్ వివరాలను ఎప్పటికప్పుడు యాప్ లో నమోదు చేయాలని చివరి రోజు ఎక్కువ మంది అభ్యర్థులు వచ్చి అవకాశం ఉన్నందున అవసరమైన ఏర్పాట్లు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. గడ్డిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో గడ్డిపల్లి, కుతుబ్ షాపురం, చిన్న గారకుంట తండా, మర్రికుంట పొనుగోడు, గ్రామపంచాయతీ కార్యాలయంలో పోనుగోడు, రామచంద్రాపురం, అప్పన్నపేట, కోదండరాంపురం గ్రామ పంచాయతీ సర్పంచులకు, వార్డు సభ్యులకు నామినేషన్ స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగిన పట్టిష్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలోనే వాహనాలను, ప్రజలను నిలిపివేసి అభ్యర్థితో కేవలం ముగ్గురు మాత్రమే నామినేషన్ వేసేందుకు అనుమతిస్తున్నామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది నేర చరిత్ర గల వ్యక్తులను గుర్తించి బైండోవర్ చేయటం జరిగిందని తెలిపారు.ప్రతి మండలంలో సమస్య ఆత్మక గ్రామాన్ని గుర్తించామని దానికి అనుగుణంగా అవసరమైన భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బైండోవర్ ఆయన వ్యక్తులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడిన చర్యలు తీసుకుంటామని వారికి రెండు నుంచి ఐదు లక్షల వరకు జరిమానా కూడా విధించడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్ జరిగేటప్పుడు,కౌంటింగ్ నిర్వహించేటప్పుడు పట్టిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని కౌంటింగ్ పూర్తి అయిన అనంతరం గ్రామాలలో బాణాసంచా పిలుస్తూ, డీజే సౌండ్ లతో ర్యాలీలు నిర్వహించడం వద్దని, వీటిపై నిషేధిత ఆత్మలు అమలులో ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో సీఐ చరమందరాజు, ఎస్ఐ చలికంటి నరేష్, ఆర్డీవో శ్రీనివాసులు, ఎంపీడీవో సరోజ, తాసిల్దార్ స్రవంతి, ఆర్వోలు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.