15 April, 2026 | 1:18 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

సెస్ చైర్మన్ కు వినతి పత్రం ఇచ్చిన నీలోజి పల్లి సర్పంచ్

27-12-2025 08:43 PM

బోయినపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నిరోజిపల్లి సర్పంచ్ అనుముల భాస్కర్ శనివారం గ్రామస్తులతో కలిసి సెస్ చైర్మన్ చిక్కాల రామారావుకు వినించపత్రం సమర్పించారు. గ్రామంలో ఎస్సీ కాలనీలో స్మశాన వాటిక వద్ద విద్యుత్ తీగలు దొంగలు చోరి చేయగా విద్యుత్ సరఫరా గత కొద్ది నెలలుగా నిలిచిపోయింది. దీంతో స్మశాన వాటిక వద్ద అంధకారం నెలకొంది.

హరితహారంలో పల్లె ప్రకృతిలో మొక్కలకు నీరు అందించేందుకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఇబ్బందులు అవుతున్నాయని ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. వెంటనే విద్యుత్ తీగలు అమర్చి, విద్యుత్ సరఫరా పుణ్యదుద్ధరించాలని ఆయన కోరారు. అందుకు సెస్ చైర్మన్ చిక్కాల రామారావు స్పందించి సత్వరమే విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు హామీ ఇచ్చినట్లు సర్పంచ్  భాస్కర్ తెలిపారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేస్ ఎండి బిక్షపతి, మాజీ వైస్ ఎంపీపీ నాగయ్య తదితరులున్నారు.