14 June, 2026 | 4:20 PM

Breaking News

పెద్దపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు వేగంగా అడుగులు   •   ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శికి ఘన సన్మానం   •   ఆసిఫాబాద్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి   •   ఎమ్మెల్యే.. కలెక్టర్ ల చొరవ.. రెండు నెలల్లో వంతెన పనులు పూర్తి   •   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యం: మంత్రి బండి సంజయ్ కుమార్   •   సుల్తానాబాద్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చొప్పరి సుమన్   •   రాష్ట్ర కమిటీలో నైతం కృష్ణారావు చోటు   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎర్రగుంట సర్పంచ్   •   మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగ   •   రేవంత్ రెడ్డి పాలన ఫస్ట్ ఆఫ్ అట్టర్ ఫ్లాప్: కేటీఆర్   •  

సీఎంకు ఆహ్వానం

12-01-2026 01:47 PM

హైదరాబాద్: ఈ నెల 21 నుంచి 23 వరకు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో వసంతపంచమి  మహోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆలయ ఈవో, బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయ అర్చకులు కలిసి ఆహ్వానం అందించారు. పండితులు ఆశీర్వచనాలు అందించారు. గద్వాలలోని ఆలంపూర్‌లో ఉన్న శ్రీ జోగులాంబ ఆలయంలో జనవరి 19 నుండి 23 వరకు జరిగే బ్రహ్మోత్సవాల కోసం ముఖ్యమంత్రికి ప్రత్యేక ఆహ్వానం పంపబడింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి అధికారులు ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ఆహ్వాన పత్రాలను అందజేశారు. గిరిజన సంక్షేమ శాఖ రూపొందించిన మేడారం మహా జాతర బ్రోచర్, పోస్టరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు సీతక్క,  కొండా సురేఖతో కలిసి సోమవారం ఆవిష్కరించారు.