10 April, 2026 | 7:44 PM

Breaking News

సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా అవగాహన కార్యక్రమం   •   భవన నిర్మాణ కార్మికులకు కార్మిక భవన్ ఏర్పాటుకు సహకరిస్తా   •   విజయక్రాంతి ఎఫెక్ట్   •   రుద్రారం శివారులో అక్రమ ఇసుక టిప్పర్ సీజ్... ఒకరి అరెస్ట్   •   రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తాం   •   దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రెండవ రాష్ట్ర మహాసభలు   •   మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసిన హాఫీజుద్దీన్   •   ప్రతి గడపకూ సంక్షేమ కాంతి.. ప్రతి రైతుకూ ప్రభుత్వ భరోసా : మంత్రి పొంగులేటి   •   నిఘా నేత్రల ఏర్పాటులో భాగస్వామ్యులు కావాలి   •   గబ్బిలాల పేటలో ప్రభుత్వ పాఠశాల సాధించే వరకు పోరాటం ఆగదు   •  

మంచిర్యాలలో ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి

12-01-2026 03:12 PM

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్ లేకపోవడంతో ప్రజలు కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, స్థానికంగా ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నహీం పాషా అన్నారు.

సోమ వారం మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయ సూపరింటెండెంట్ విశ్వేశ్వర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోనే ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు సమయ, ఆర్థిక భారాలు తగ్గుతాయని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.