calender_icon.png 7 June, 2025 | 11:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు విస్తరణ పనులకు అందరూ సహకరించాలి

07-06-2025 12:48:33 AM

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చండూరు, జూన్ 6 : చండూరు మున్సిపాలిటీలోని జరుగుతున్న రోడ్డు పనులకు అందరూ సహకరించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం చండూరు మున్సిపాలిటీలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. దుకాణాల యజమానులతో రోడ్డు విస్తరణకు అందరూ సహకరించాలని ఆయన అన్నారు.

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్ స్తంభాల పనులను వేగవంతం చేయాలన్నారు. చండూరు మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు ప్రజల సంక్షేమం కొరకు నిరంతరం కృషి చేస్తుందని ఆయన అన్నారు. అనంతరం బంగారిగడ్డ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం భవన నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు.

ఈ కార్యక్రమంలో ట్రస్మా  జిల్లా అధ్యక్షులు కోడి శ్రీనివాసులు, కాంగ్రెస్ పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు అనంత చంద్రశేఖర్, కొరిమి ఓంకారం, చండూరు మాజీ సర్పంచ్ కోడి గిరిబాబు, మాజీ ఎంపీటీసీ పల్లె వెంకన్న,మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దోటి సుజాత వెంకటేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అబ్బనబోయిన లింగయ్య, ఇర్గి మల్లేష్, భీమనపల్లి శేఖర్, భూతరాజు వేణు, ధర్మేందర్, దశరథ, లింగయ్య, మారయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.