14 April, 2026 | 5:11 PM

Breaking News

ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •   చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కుంజా వినోద్   •  

జిల్లాలో డ్రగ్స్ రహిత నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలి

18-11-2025 12:53 PM

జిల్లా అధికారులు, సిబ్బంది చే మాదకద్రవ్యాల నిరోధన ప్రతిజ్ఞ లో జిల్లా కలెక్టర్ శ్రీహర్ష

పెద్దపల్లి,(విజయక్రాంతి): జిల్లాలో డ్రగ్స్ రహిత నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు పాటు పడాలని జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాశాము మొత్తం భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్  అదనపు కలెక్టర్ డి వేణు, డీసీపీ కరుణాకర్ లతో కలిసి జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది చే మాదకద్రవ్యాల నిరోధన ప్రతిజ్ఞ చేయించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... మాదకద్రవ్యాలు నియంత్రణ కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, డ్రగ్స్ రహిత జీవన శైలి అనుసరిస్తూ, మన చుట్టూ ఉన్న ఎవరు డ్రగ్స్ బారిన పడకుండా మన వంతు కృషి చేయాలని, యువత జీవితాలను డ్రగ్స్ మహమ్మారి నాశనం చేస్తుందని, సరదా కోసం కూడా ఎటువంటి చెడు అలవాట్ల వైపు దృష్టి సారించవద్దని కలెక్టర్ సూచించారు.  డ్రగ్స్ అమ్మకం కొనుగోలు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్న వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు.