13-03-2025 01:27:23 AM
జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కేవీ చంద్రశేఖర్రావు
ఖమ్మం, మార్చి -12:( విజయక్రాంతి ): ఈనెల 22 న జిల్లా న్యాయ సేవాధికారి సంస్థలో ఖాళీ పోస్టుల భర్తీ కోసం పరీక్షలు నిర్వహిస్తున్నామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.వి. చంద్రశేఖర్ రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, ఖమ్మంలో గల ఉద్యోగాలకు నోటిఫికేషన్ నెం. 4/2024 ను 13 నవంబర్, 2024 న జారీ చేశామని, దాని ప్రకారం సంబంధిత ఉద్యోగాలకు చైర్మన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఖమ్మం ఆధ్వర్యంలో మార్చి 22న ఎస్ఆర్ అండ్ బిజిఎన్ఆర్ డిగ్రీ కళాశాల లో పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
స్టేనో/ టైపిస్టు పరీక్ష ఉదయం 9.00 గంటల నుంచి ఉదయం 9.45 వరకు, టైపిస్ట్ కం అసిస్టెంట్ పరీక్ష ఉదయం 10.15 గంటల నుంచి ఉదయం 11.00 గంటల వరకు, జూనియర్ అసిస్టెంట్ పరీక్ష మధ్యాహ్నం 12.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు, రికార్డు అసిస్టెంట్ పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, అభ్యర్థులు వెబ్ సైట్ ద్వారా తమ హల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.