calender_icon.png 11 September, 2025 | 7:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతుల కుటుంబానికి ఆర్థిక సహాయం అందచేసిన ప్రసన్నరాజ్

11-09-2025 05:07:33 PM

నకిరేకల్ (విజయక్రాంతి): కట్టంగూర్ గ్రామపరిధిలోని పద్మశాలి కాలనీకి చెందిన ఆకుల ఎల్లమ్మ, అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన గోపగాని ముత్తయ్య మరణించారు. వారి పార్ధీవదేహానికి గురువారం బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నలగాటి ప్రసన్న రాజ్ పూలమాల వేసి నివాళర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ సూర్యాపేట జిల్లా సీనియర్ నాయకులు మారి పెద్ది శ్రీనివాస్ కట్టంగూర్ మండల పార్టీ అధ్యక్షులు ఊట్కూరు ఏడుకొండలు. పిఎసిఎస్ మాజీ చైర్మన్ నూక సైదులు. జిల్లా నాయకులు మేకల రమేష్. జిల్లా నాయకులు గుండాల మల్లేష్ గౌడ్. చెరుకు వెంకటాద్రి. చింత నాగార్జున. ఊట్కూరి నాగయ్య. తండు సోమయ్య. నిమ్మనగోడి శివ. బాణాల ఎలమంద. చీర బోయిన నాగరాజు తదితరులు పాల్గొన్నారు.