16-06-2025 12:11:11 AM
జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
జగిత్యాల అర్బన్, జూన్ 15 (విజయక్రాంతి): సేవా కార్యక్రమాల ద్వారానే ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుందని, వైద్యులు సేవా భావాన్ని పెంపొందించుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో ‘ఆవో గావ్ చలో‘ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామాన్ని దత్తత తీసుకొని ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్మాట్లాడుతూ వైద్యులు సేవా భావంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. వైద్యో నారాయణ హరి అని వైద్యుడు దైవంతో సమానంగా ప్రజలు భావిస్తారని, 10 విభాగాల వైద్యులు వచ్చి ఉచిత పరీక్షలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఐఎంఏ ఆద్వర్యంలో దేశంలో దాదాపు 7వేల గ్రామాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు.
ఈ వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సంజయ్ కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ హేమంత్, కార్యదర్శి డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్, కోశాధికారి డాక్టర్ కోటగిరి సుధీర్, ప్రముఖ వైద్యులు పద్మిని, నాగరాజు, రాజశేఖర్, స్వరూప, రజిత, విజయ్, గీతిక, శ్రీధర్, శ్రీనివాస్, నవీన్, శ్రవణ్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.