26-05-2025 01:01:15 PM
హైదరాబాద్: సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ కార్యాలయం(Sircilla KTR Camp Office) వద్ద సోమవారం నాడు ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేటీఆర్ క్యాంపు ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో(CM Revanth Reddy) పెట్టేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని తోపులాట జరిగింది. రంగ ప్రవేశం చేసిన సిరిసిల్ల పోలీసులు(Sircilla Police) లాఠీ ఛార్జి చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. పోలీసుల లాఠీ ఛార్జిలో బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి సహా పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసుల వైఖరిపై బీఅర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.