26-05-2025 12:45:34 PM
హైదరాబాద్: చెర్లపల్లి రైల్వే స్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్లో(Janmabhoomi Express) ఎక్కేందుకు ప్రయత్నిస్తూ 33 ఏళ్ల మహిళ పడిపోవడంతో మరణించింది. ఈ సంఘటన ఆదివారం ఉదయం 7.40 గంటల ప్రాంతంలో జరిగిందని ప్రభుత్వ రైల్వే పోలీస్ (సికింద్రాబాద్) అధికారి తెలిపారు. మత్తల శ్వేతగా గుర్తించబడిన మృతురాలు, రైలు కదలడం ప్రారంభించినప్పుడు తన ఇద్దరు పిల్లలను డీ3 కోచ్ నుండి డీ8 కి తరలించడానికి ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారి తెలిపారు. “శ్వేత మొదట తన భర్త వెంకటేష్, వారి పిల్లలతో కలిసి రాజమండ్రిలోని తన అత్తమామల ఇంటికి వెళ్లడానికి లింగంపల్లిలో రైలు ఎక్కింది. భారీ రద్దీ కారణంగా, ఆమె మిగిలిన కుటుంబం నుండి వేరు కోచ్ లో ఎక్కింది," అని ఆయన చెప్పారు.
చెర్లపల్లి స్టేషన్లో(Charlapalli Railway Station) ఆమె తన పిల్లలతో కలిసి డీ3 కోచ్ నుండి దిగి డీ8 కోచ్ ఎక్కేందుకు ప్రయత్నించింది. ఆమె ఎక్కడానికి ప్రయత్నించే సమయంలో రైలు అప్పటికే వేగం పుంజుకుంది. ఆమె పాదాలు జారి ప్లాట్ఫారమ్, కదులుతున్న రైలు మధ్య పడిపోయింది. ఆమె తలకు రెండుసార్లు దెబ్బలు తగలడంతో, తలకు తీవ్ర గాయం, నడుము విరిగిపోవడం, కాలు తెగిపోవడం జరిగింది. అధిక రక్తస్రావం కారణంగా ఆమె అక్కడికక్కడే మరణించింది. శవపరీక్ష తర్వాత మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు. శ్వేత గృహిణి, ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా(Anakapalli District)లోని దొండపూడి గ్రామానికి చెందినవారు. ఆమె భర్త ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. పిల్లలకు సెలవు కావడంతో ఊరికి వెళ్తే క్రమంలో శ్వేత అనంతలోకాలకు చేరుకుంది. ఈ సంఘటన వారి కుటుంబీకులను విషాదంలోకి నెట్టింది.