31-05-2025 12:28:50 AM
కడ్తాల్, మే 30 : కడ్తాల్ మండలంలోని చరికొండ, పట్టి పడకల్ గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో శుక్రవారం రైతులకు పర్యావరణ హిత వ్యవసాయ పద్ధతులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.డా.వి.అనిత, డా.టి. సు ప్రజ, డా.ఎం. సుజాతలు
ఈ కార్యక్రమంలో పాల్గొని పంట మార్పిడి, అంతరపంటలు, వర్మీ కాంపోస్ట్, పచ్చి రొట్ట వంటి పద్ధతులు నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు దిగుబడుల పెరుగుదలకు దోహదపడతాయని వివరించారు.పాడి అధికంగా ఉన్న గ్రామంలో పశువుల పెడ ను వినియోగించి ఎరువుల తయారీపై దృష్టి సారించాలన్నారు.
నీటి ఎద్దడి నివారణకు బిందు, తుంపర సాగు వంటి నీటి సంరక్షణ విధానాలు కీలకం అని తెలిపారు.రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోలు రసీదులను భద్రంగా ఉంచుకోవడం ద్వారా నష్ట పరిహారం పొందవచ్చని స్ప ష్టం చేశారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం చిరుధాన్యాల విలువ జోడింపు, కుట్టుపనుల పై శిక్షణ ఇవ్వడం అవసరమని డా. సుప్రజ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ అభినవ్ రెడ్డి, మాజీ గ్రామ సర్పంచ్ నారాయణ గౌడ్, అభ్యుదయ రైతులు శ్రీ మల్లారెడ్డి, శ్రీ సత్య శీలా రెడ్డి పాల్గొన్నారు.