calender_icon.png 2 June, 2025 | 11:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్య,వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

31-05-2025 12:28:17 AM

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 

బూర్గంపాడు,మే30 (విజయక్రాంతి):విద్య వైద్యరంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం బూర్గంపాడు మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రూ.2. 70 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా మెరుగైన వైద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. అధునాతన భవన నిర్మాణాన్ని ఆరు నెలలలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.అనంతరం ఆరోగ్య కేంద్రాలోని రోగులతో ఆప్యాయతగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శిరీష,ఎంపీడీవో జమలారెడ్డి,ఆర్ అండ్ బి డిఈ సతీష్,ఆసుపత్రి సూపర్డెంట్ ముక్కంటేశ్వరరావు, మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి,మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి,మాజీ ఎంపీపీ రోశిరెడ్డి,మండల నాయకులు కైపు శ్రీనివాసరెడ్డి, భజన సతీష్ పాల్గొన్నారు.