1 May, 2026 | 1:46 PM

నిజామాబాద్ జిల్లాలో రోడ్డెక్కిన రైతన్నలు.. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం

01-05-2026 12:24 PM

నిజామాబాద్ జిల్లాలో రోడ్డెక్కిన రైతన్నలు

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా( Nizamabad district) ఎల్లారెడ్డిపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. ఇందల్వాయి-ధర్పల్లి మధ్య రహదారిపై రైతులు బైఠాయించారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై కర్షకులు ఆందోళన చేపట్టారు. ధాన్యం తరలింపులోనూ జాప్యం జరుగుతుందంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోళ్లు, బస్తాల తరలింపు వేగవంతం చేయాలని డిమాండ్  చేశారు. రోడ్డుపై ధాన్య పోసిన రైతులు ధర్నాకు దిగారు. 15 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆగ్రహించారు.

వరి ధాన్యానికి నిప్పుపెట్టి నిరసన తెలిపారు. ఐకేపీ, సొసైటీ అధికారుల తీరుపై రైతులు మండిపడ్డారు. ఆందోళనలో పాల్గొన్న బీజేపీ నాయకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇవాళ వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. క్వింటాలుకు 10 కిలోల చొప్పున తరుగు తీస్తున్నారని, 30 రోజులు గడిచినా ధాన్యం కొనుగోలు చేయడంలేదని సిరికొండ మండల కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు.