18 August, 2026 | 7:54 PM

Breaking News

సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త సర్వాయి పాపన్న గౌడ్   •   సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం   •   ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ఫోకస్‌.. అధికారులకు క్లాస్‌   •   పాలిటెక్నిక్ విద్యార్థుల ర్యాలీ.. రాస్తారోకో   •   చెన్నూర్ లో ఘనంగా పాపన్న గౌడ్ జయంతి వేడుకలు   •   పశు పోషణ యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమం   •   సేంద్రియ వ్యవసాయంతో లాభాలు   •   ఈనెల 19న జిల్లాకు ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య   •   ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు   •   అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు   •  

నిజామాబాద్ జిల్లాలో రోడ్డెక్కిన రైతన్నలు.. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం

01-05-2026 12:24 PM

నిజామాబాద్ జిల్లాలో రోడ్డెక్కిన రైతన్నలు

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా( Nizamabad district) ఎల్లారెడ్డిపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. ఇందల్వాయి-ధర్పల్లి మధ్య రహదారిపై రైతులు బైఠాయించారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై కర్షకులు ఆందోళన చేపట్టారు. ధాన్యం తరలింపులోనూ జాప్యం జరుగుతుందంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోళ్లు, బస్తాల తరలింపు వేగవంతం చేయాలని డిమాండ్  చేశారు. రోడ్డుపై ధాన్య పోసిన రైతులు ధర్నాకు దిగారు. 15 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆగ్రహించారు.

వరి ధాన్యానికి నిప్పుపెట్టి నిరసన తెలిపారు. ఐకేపీ, సొసైటీ అధికారుల తీరుపై రైతులు మండిపడ్డారు. ఆందోళనలో పాల్గొన్న బీజేపీ నాయకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇవాళ వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. క్వింటాలుకు 10 కిలోల చొప్పున తరుగు తీస్తున్నారని, 30 రోజులు గడిచినా ధాన్యం కొనుగోలు చేయడంలేదని సిరికొండ మండల కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు.