15-02-2026 12:00:00 AM
కల్వకుర్తి, ఫిబ్రవరి 14(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జడ్చర్ల జాతీయ రహదారిపై శనివారం తెల్లవారు జామున ఊర్కొండ మండలం తిమ్మన్నపల్లి వద్ద తుఫాన్ వాహనం కల్వర్ట్కు ఢీకొని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా నుంచి తుఫాన్ వాహనంలో శ్రీశైల దేవస్థానానికి వెళ్తుండగా ఈ ఘోర దుర్ఘటన జరిగింది. అందులో ప్రయాణిస్తున్న వారిలో రమణ గౌడ్ (52 )మేఘ దాసి (46 )మాధవి (60 )ముగ్గురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన పలువురిని వెల్దండ సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పంచనామ నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.