25-06-2025 12:14:17 PM
ఇల్లెందు టౌన్, (విజయక్రాంతి): ఇల్లందు మండలంలోని మర్రిగూడెం గ్రామపంచాయతీలోని(Marrigudem Gram Panchayat) ఎల్లాపురం గ్రామంలో బుధవారం తెల్లవారుజామున ఓ ఇంటిలో జరిగిన విద్యుత్ షాక్ ఘటనలో తండ్రీకొడుకులు మృతి చెందారు. ఎల్లాపురం గ్రామానికి చెందిన ఏనుగు నరసయ్య తెల్లవారుజామున మూత్ర విసర్జన కోసం బాత్రూంకి వెళ్తున్న క్రమంలో విద్యుత్ తీగకు ఆనుకొని విద్యుత్ షాక్ కు గురయ్యాడు. దీంతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తన తండ్రిని కాపాడేందుకు కొడుకు ప్రవీణ్ హుటాహుటిన వెళ్లి ప్రయత్నించగా దురదృష్టవశాత్తు ప్రవీణ్ కూడా అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిని గమనించిన నరసయ్య భార్య ఎర్రమ్మ వారిద్దరిని కాపాడేందుకు ప్రయత్నించి తాను స్పృహ కోల్పోయింది. గాయాలతో ఉన్న ఆమెను స్థానికులు ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.