19-05-2025 07:43:24 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కొడుకుపై తండ్రి రాడ్డుతో దాడి చేయగా చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన కామారెడ్డి(Kamareddy)లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని లింగాపూర్కు చెందిన వడ్ల నిఖిల్(24) మూడు నెలల క్రితం దుబాయ్(Dubai) నుంచి తిరిగొచ్చాడు. వచ్చినప్పటి నుంచి మద్యం, గంజాయి, కల్లుకు అలవాటు పడిన నిఖిల్ ప్రతిరోజు తల్లిదండ్రులతో గొడవపడేవాడు. ఈ క్రమంలో సోమవారం నిఖిల్ తన తండ్రి భాస్కర్తో గొడవకు దిగాడు.
ఈ క్రమంలో తండ్రి భాస్కర్ ఇనుప రాడ్డుతో నిఖిల్పై దాడి చేశాడు. దీంతో నిఖిల్కు తీవ్రగాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం జీజీహెచ్కు(GGH Kamareddy) తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొడుకు మృతికి కారణమైన తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.