calender_icon.png 15 June, 2025 | 11:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైలు నుంచి జారిపడి..

10-06-2025 12:00:00 AM

  1. ఐదుగురు దుర్మరణం 
  2. ముంబై లోకల్ ట్రైన్‌లో దారుణం

ముంబై, జూన్ 9: ముంబైలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. లోకల్ ట్రైన్ నుంచి జారిపడి ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ముంబై చత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్‌టీ) నుంచి థానే జిల్లా కేసర ప్రాంతానికి వెళ్తున్న రైలులో ఈ దుర్ఘటన జరిగింది. రైలు రద్దీగా ఉండటంతో కొంత మంది డోర్ల వద్ద నిల్చున్నారు.

అలా డోర్ల వద్ద నిల్చున్న వారిలో కొందరు కిందపడిపోయి దుర్మరణం పాలయ్యారు. మొత్తం 12 మంది వ్యక్తులు జారి కిందపడిపోగా ఐదుగురు మరణించినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

రైల్వే శాఖ కీలక నిర్ణయం

ఈ ప్రమాదం నేపథ్యంలో రైల్వేశాఖ కీలకనిర్ణయం తీసుకుంది. ముంబై సబర్బన్ ప్రాంతంలో నడిచే అన్ని రైళ్లకు ఆటోమేటిక్ డోర్లు ఏర్పాటు చేయనున్నట్టు రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రతే రైల్వే శాఖ ప్రథమ ప్రాధాన్యం అని పేర్కొన్నారు.