15 June, 2026 | 10:41 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

మహిళా మావోయిస్ట్ ఎన్‌కౌంటర్

07-09-2025 12:41 AM

ఛత్తీస్‌గఢ్‌లోని రాయణపూర్- దంతెవాడ జిల్లాల మధ్య ఘటన

చర్ల, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): చర్ల సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ర్టంలోని నారాయణ పూర్-- దంతేవాడ జిల్లాల సరిహద్దులోని అబూజ్‌మడ్ అడవుల్లో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళా మవోయిస్టు మృతి చెందింది. ఈ ప్రాంతంలో మావోయి స్టులు ఉన్నారనే సమాచారంలో రెండు జిల్లాలకు చెందిన డీఆర్‌జీ(డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్), స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సంయుక్త బృం దం ఆపరేషన్ చేపట్టింది.

ఈ ఆపరేషన్ జరుగుతండగా బలగాలకు, మవోయిస్టుల కు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకు న్నాయి. ఈ కాల్పులో ఓ మహిళా మావో యిస్టు మృతి చెందగా,మరి కొందరు మావో యిస్టులు తప్పించుకున్నారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఒక 303 రైఫిల్, 2 బీజీఎల్స్ లాంచర్లను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. 

తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చర్యను ముమ్మరం చేశారు. కాగా ఎన్‌కౌంట ర్‌లో మృతి చెందిన మహిళా మావోయిస్టు  సోధి విమ్లాగా గుర్తించారు. ప్లాటూన్ నంబర్ 16 కమాండర్, పీపీసీ కార్యదర్శి అని, ఆమెపై రూ. 8 లక్షల రివార్డు ఉందని పోలీ సులు తెలిపారు.