29 August, 2026 | 8:39 PM

Breaking News

మంత్రి సీతక్కను కలిసిన ఎమ్మెల్యే మదన్మోహన్   •   సర్కార్ స్థలాలు కాపాడండి   •   ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం ప్రజా పాలనకు పెద్దపీట ఎమ్మెల్యే జారె   •   ఉద్యమకారుల సంక్షేమ సంఘం నకిరేకల్ అధ్యక్షుడిగా ఉయ్యాల ప్రశాంత్ గౌడ్   •   వెయ్యి రోజుల పాలనలో రేవంత్ సర్కార్ అట్టర్‌ఫ్లాప్   •   1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్‌ పోరుబాట   •   షాలేము బహుజన దమ్మపేట మండల పాస్టర్స్ ఫెలోషిప్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె   •   నగర సమగ్ర అభివృద్ధే లక్ష్యం: మేయర్ కొలగాని శ్రీనివాస్   •   కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల విఫల పాలనలో వరుస నిరసనలే...   •   ఘనంగా జాతీయ క్రీడ, తెలుగు భాషా దినోత్సవ వేడుకలు   •  

రూ.1200 కోట్ల ప్రభుత్వ స్థలానికి ఫెన్సింగ్

23-04-2025 12:40 AM

- ఆక్రమణకు ప్రయత్నిస్తే క్రిమినల్ కేసులు

- హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 22 (విజయక్రాంతి):  ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు ప్రయత్నించినా, ఆక్రమించినా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

మంగళవారం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 ఏసీబీ కార్యాలయం ఎదుట గల రూ.1,200 కోట్ల విలువగల 12 ఎకరాల ప్రభుత్వ స్థల రక్షణకు డీజీపీఎస్ సర్వే నిర్వహించి, హద్దులు నిర్ణయించి ఫెన్సింగ్ వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. శనివారంలోగా రూ.35 లక్షలతో జిఐ షీట్స్, ఐరన్ పోల్స్ చేపట్టిన పనులను పూర్తి చేయాలన్నారు. ఆ స్థలం ప్రభుత్వాని దని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టర్‌తో పాటు సికింద్రాబాద్ ఆర్డీవో సాయిరాం, షేక్‌పేట తహసీల్దార్ అనితరెడ్డి, డీఈ సంజీవ్, ఏఈ శ్రీధర్ ఉన్నారు.